Famous TV - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్దకృష్టాపురంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్నారి కంటి వింత వ్యర్థాలు రాలిపడుతున్నాయి. ఏడేళ్ల చిన్నారి'సర్వేంద్రియానం నయనం ప్రధానం' అన్నారు పెద్దలు. మనిష శరీరంలో కళ్లు అత్యంత ప్రధానమైనవి. కోపమైనా, సంతోషమైనా, దుఃఖమైనా ఇలా ప్రతి హావభావాల్ని కళ్లతో పలికించవచ్చు. సంతోషం, దుఃఖం ఏది వచ్చినా కంటి నుంచి కన్నీళ్లు వస్తాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్దకృష్టాపురంలో మాత్రం ఓ చిన్నారి కంటి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇనుప ముక్కలు, పేపర్ ముక్కలు వస్తున్నాయి. అదేంటి కళ్ల నుంచి వింత వ్యర్థాలు రావటమేంటని ఆశ్చర్యపోతున్నారా ? అవునండీ బాబు చిన్నారి కళ్ల నుంచి ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు వస్తున్నాయని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.
Admin
Famous TV