Famous TV - తెలంగాణ / : అందోల్ మండలం తాడ్మన్నూర్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఎస్పీ అందోల్ అసెంబ్లీ ఇన్చార్జి డా.ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ స్థానికేతరులే స్థానికులమని అందోల్ నియోజకవర్గ ప్రజలను నమ్మించి నట్టేట ముంచారని, నిజమైన స్థానికులం వచ్చినమని, మా ఓట్లు మేమే వేసుకొని మా నియోజకవర్గాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటామని, ప్రజల పక్షాన పోరాడి నిలబడిన నాయకులనే అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానికేతర ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ అందోల్ నియోజకవర్గం ప్రజలు అనేక అవస్థలకు గురయ్యారని, వారి బాధలను పరిష్కరించడం కోసమే బిఎస్పి పార్టీ స్థానిక నాయకత్వం రంగంలోకి దిగిందని, స్థానికేతరుల ఆగడాలు ఇకపై ఇక్కడ చెల్లవని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తాడ్మన్నూర్ గ్రామ బీఎస్పీ కమిటీని, బూత్ కమిటీలను 50 మంది సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో బిఎస్పి అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, వట్టిపల్లి మండల అధ్యక్షులు పల్లె కిరణ్ కుమార్, అందోల్ మండల అధ్యక్షులు డప్పు దుర్గేష్, చౌటకూర్ మండల నాయకులు డబ్బు పోచయ్య, బేగరి హరీష్, గ్రామ కమిటీ అధ్యక్షులు తలారి రాములు బూత్ కమిటీ అధ్యక్షులు డప్పు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV