Saturday, 13 June 2026 12:17:20 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా నియోజకవర్గాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటాం

తాడ్మన్నూరు గ్రామ ప్రజలు, యువకులు తీర్మానం దొంగ స్థానికులు పోవాలి, నిజమైన స్థానికులు రావాలి

Date : 13 September 2023 05:38 PM Views : 456

Famous TV - తెలంగాణ / : అందోల్ మండలం తాడ్మన్నూర్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఎస్పీ అందోల్ అసెంబ్లీ ఇన్చార్జి డా.ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ స్థానికేతరులే స్థానికులమని అందోల్ నియోజకవర్గ ప్రజలను నమ్మించి నట్టేట ముంచారని, నిజమైన స్థానికులం వచ్చినమని, మా ఓట్లు మేమే వేసుకొని మా నియోజకవర్గాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటామని, ప్రజల పక్షాన పోరాడి నిలబడిన నాయకులనే అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానికేతర ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ అందోల్ నియోజకవర్గం ప్రజలు అనేక అవస్థలకు గురయ్యారని, వారి బాధలను పరిష్కరించడం కోసమే బిఎస్పి పార్టీ స్థానిక నాయకత్వం రంగంలోకి దిగిందని, స్థానికేతరుల ఆగడాలు ఇకపై ఇక్కడ చెల్లవని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తాడ్మన్నూర్ గ్రామ బీఎస్పీ కమిటీని, బూత్ కమిటీలను 50 మంది సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో బిఎస్పి అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, వట్టిపల్లి మండల అధ్యక్షులు పల్లె కిరణ్ కుమార్, అందోల్ మండల అధ్యక్షులు డప్పు దుర్గేష్, చౌటకూర్ మండల నాయకులు డబ్బు పోచయ్య, బేగరి హరీష్, గ్రామ కమిటీ అధ్యక్షులు తలారి రాములు బూత్ కమిటీ అధ్యక్షులు డప్పు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :