Famous TV - కళలు / తిరుపతి : జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ జాతీయ డైరక్టర్ ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి విశిష్ట సేవా శిరోమణి పురస్కారం స్వీకరించారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన సభలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం అందజేశారు. దేశ విదేశాలలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు. ఆయనతో పాటు డాక్టర్ ఎన్ శాంతి మోహన్ కు నాట్య విద్యన్మణి, ఆర్ మునస్వామికి సేవారత్న, హరిశ్రీనిత, భవితశ్రీ లకు నాట్య తరంగినణి పురస్కారాలు ఇచ్చారు. పురప్రముఖులు పి సి రాయల్, వేణుగోపాల్ రెడ్డి, వై ఎస్ బాబు, గుండాల గోప, కె ఎన్ రాజ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Famous TV