Famous TV - కళలు / చిత్తూరు : ఈరోజు ఉదయం 8:30 గంటలకు స్థానిక తిరుపతి ఘంటసాల సర్కిల్ నందు ఘంటసాల గారి విగ్రహం వద్ద 50వ ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా తిరుపతి ఫిలిం సొసైటీ ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్ ఎలమంచిలి ప్రవీణ్ ముఖ్యఅతిథిగా మరియు జోష్ ప్రాపర్టీస్ అధినేత ప్రకాష్ గౌరవ అతిథులుగా విచ్చేశారు.ఈ కార్యక్రమంలో ఫిలిమ్స్ సొసైటీ సభ్యులు ఘంటసాల గారి శ్లోకాలను మరియు పాటలను ఆలపించి నివాళులు అర్పించారు.అనంతరం అతిధులు ఘంటసాల గారికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఘంటసాల గారి లేని లోటు సినీ ప్రపంచానికి తీరని దని ,ప్రతి సంవత్సరం ఘంటసాల వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఫిలిం సొసైటీ వారోత్సవాలు నిర్వహించడం తిరుపతికి గర్వకారణమని ,ఎంతమంది గాయకులు వచ్చిన ఆయన లేని లోటు తీర్చలేరని అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఫిలిమ్స్ సొసైటీ అధ్యక్షులు వై.యస్ బాబు గారు,ప్రధాన కార్యదర్శి శేషగిరి రావు, కోశాధికారి ప్రసాదరావు, బుచ్చిబాబు జెసి శంకర్ మేరీ జాయి, శాంత వాణి , అనసూయ, సుబ్రహ్మణ్యం , గాయకులు సోము ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Famous TV