Famous TV - కళలు / తిరుపతి : జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం గురువారం రెండు రోజులు ది. జూన్ 7,8- 2023 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రo కర్నూల్, కడప, విజయనగరం జిల్లా నాయకుల మండల నాయకుల శిక్షణా తరగతులు తిరుపతిలోని A.G.S. కాలేజీ ఆవరణంలో కర్నూల్ జిల్లా అధ్యక్షుడు నాగమల్లెలు అధ్యక్షతన జరిగినాయి. ఈ క్లాసుల కు ప్రిన్సిపాల్ గా రాష్ట్ర నాయకులు M. నారాయణ గారు బాధ్యత వహించి రెండు రోజులు నిర్వహించడం జరిగినది. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి గారికి భజన కళాకారుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చి, భజన నమోదు పత్రాలు మార్పులు చేర్పులు చేయడానికి జిల్లా, మండల నాయకుల ద్వారా వెళ్లి ఇవ్వడం జరిగింది. ఈ క్లాసులలో గ్రామ కమిటీ నిర్మాణం చేయడం మరియు అలిపిరి నుంచి తిరుమల ప్రతి పౌర్ణమికి పాదయాత్ర నిర్వహిస్తున్న జానపద వృత్తి కళాకారుల సంఘం మరియు హిందూ మహాసభ కమిటీలకు సంఘీభావంగా గ్రామాలలో కళాకారులు భక్తులు పాల్గొనే విధంగా చేయడం మరియు ప్రతి బృందం కనీసం వారానికి ఒక్కసారైనా భజన చేసే విధంగా ఆ భజన బృందం సభ్యులను చైతన్య పరచడం చేయాలని క్లాసుల్లో బోధించడం జరిగింది. క్లాసులు బోధించడానికి విచ్చేసిన జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి మాట్లాడుతూ సభ్యులంతా ఐక్యంగా ఉంటే చాలా సమస్యలు పరిష్కరించు కోవచ్చని గతం నుండి అలా ఉన్నారు కాబట్టే 4 రాష్ట్రాలకు సంఘం విస్తరించిందని తెలిపినారు. అలాగే సంఘం నాయకులు విజయనగరం జిల్లా అధ్యక్షులు జనార్ధన్ గారు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమాన్విత విషయాలను తెలియపరచి ధర్మ ప్రచారం చేయడానికి భజన కళాకారులు సైన్యంలా పనిచేస్తున్నారని తెలిపినారు. ఈ శిక్షణా తరగతులు జయప్రదం చేయడానికి జానపద వృత్తి కళాకారుల సంఘం ఆఫీస్ కార్యదర్శి T. శ్రీరామ్, ADMS కిరణ్ బాధ్యత నిర్వహించగా సంఘీభావంగా హిందూ మహాసభ నాయకులు బాబు రాజేంద్రప్రసాద్ గారు, మూర్తి గారు, సుబ్రహ్మణ్యం రెడ్డి గారు సహకరించడం జరిగినది. ఈ శిక్షణా తరగతులకు విజయనగరం జిల్లా అధ్యక్షులు జనార్ధన్ గారు, కార్యదర్శి కుమారి గారు మరియు కడప జిల్లా అధ్యక్షులు రామచంద్రయ్య గారు, మరియు వెంకటయ్య గారు కర్నూలు జిల్లా అధ్యక్షులు నాగమల్లు గారు, రామాంజనేయులు గారు, నాగ లింగయ్య గారు, ఎల్లసుబ్బడు గారు, తాయన్న గారు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV