Famous TV - కళలు / తిరుపతి : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి పలు రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన విద్యార్థుల దరఖాస్తు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. జూన్ 16వ తేదీ నుంచి కళాశాలలో దరఖాస్తులు జారీ చేస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ నెలాఖరు వరకు స్వీకరిస్తారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో గాత్రం, వయోలిన్, వీణ, ఫ్లూట్, నాదస్వరం, భరతనాట్యం, హరికథ, మృదంగం, డోలు, ఘటం విభాగాల్లో ఫుల్టైమ్ విశారద(డిప్లొమా), ప్రవీణ(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో ఫుల్టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జులై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇతర ప్రాంతాల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తామని టీటీడీ తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల పని వేళల్లో రూ.50 చెల్లించి దరఖాస్తు పొందొచ్చని, ఇతర వివరాల కోసం 7330811173, 9391599995 నంబర్లను సంప్రదించగలరని తెలిపింది.
Admin
Famous TV