Famous TV - కళలు / : ఏర్పేడు నవంబర్ 7: పరమేశ్వరునికి నృత్య నీరాజనం వాల్పోస్టర్లను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మంగళవారం నాడు ఆవిష్కరించారు. ప్రసిద్ధిగాంచిన, పురాతనమైన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక పౌర్ణమి ని పురస్కరించుకొని నవంబర్ 27వ తేదీ పరమేశ్వరునికి నృత్య నీరాజనం కార్యక్రమం వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి అంకయ్య, సభ్యురాలు ముని లక్ష్మి లు కార్యక్రమం వివరాలు గురించి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ పురాతనమైన గుడిమల్లం ఆలయం గురించి వే ఫౌండేషన్ నేతృత్వంలో నృత్య నీరాజనం కార్యక్రమం ద్వారా ప్రచారం చేపట్టడం పట్ల వే ఫౌండేషన్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో 111 మంది నృత్యకారులు నృత్యం చేసి పరశురామేశ్వరునికి నృత్య నీరాజనం సమర్పించనున్నట్లు వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి అంకయ్య తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి బీసీ నాయకులు మేకలత్తూరు చంద్రశేఖర్ అలియాస్ ఎస్ ఎస్ చంద్ర, గుడిమల్లం దినేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
Admin
Famous TV