Tuesday, 15 September 2026 09:21:08 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

జర్నలిస్ట్ అవ్వాలని ఐపిఎస్ అయ్యాను, జర్నలిస్టులు ఫిట్నెస్ పై దృష్టి సారించండి - డిఐజి ఆవుల రమేష్ రెడ్డి

క్రికెట్ విజేత రాయలసీమ లయన్స్

Date : 12 June 2023 04:46 PM Views : 424

Famous TV - క్రీడలు / తిరుపతి : రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ లో జర్నలిజం నాలుగో స్తంభంగా నిలిచిందని, తాను పవిత్రమైన జర్నలిస్టు కావాలనుకుని ఐపీఎస్ ను అయ్యానని డి ఐ జి ఆవుల రమేష్ రెడ్డి పేర్కొన్నారు . జర్నలిస్టు కాలేకపోయానన్న లోటు తనలో మిగిలిపోయిందని, అందుకే వారితో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందని చెప్పారు. ఎస్వీ యూనివర్సిటీ, వెటర్నరీ కళాశాల క్రీడా మైదానాల్లో ఆదివారం జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి జోనల్స్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. 13 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడా జర్నలిస్టులు ఈ టోర్నమెంటులో పాల్గొన్నారు. టోర్నీ ఫైనల్స్ లో కృష్ణ గోదావరి ఫైటర్స్ తో రాయలసీమ లయన్స్ జట్టు తలపడి విజేతగా నిలిచింది. తిరుపతి వేదికగా నిర్వహించిన జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి జోనల్స్ క్రికెట్ టోర్నీ లో రాయలసీమ లయన్స్ జట్టు విజేతగా నిలిచింది‌. బహుమతుల ప్రధానోత్సవాలకు ముఖ్య అతిథులుగా డిఐజి ఆవుల రమేష్ రెడ్డి ,తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, రమాదేవి ఆసుపత్రి అధినేత డాక్టర్ డిబి శశిధర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ సెక్రటరీ బాలచంద్ర లు విచ్చేసి విజేతలకు బహుమతులను అందించారు. ఉదయం క్రికెట్ టోర్నమెంట్‌ను ఎస్ వి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రాజారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, ఎస్వీయూ పిడి ప్రొఫెసర్ శివశంకర్ రెడ్డి లంచనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అతిధులందరూ కొంతసేపు బ్యాటింగ్, బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డిఐజి ఆవుల రమేష్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం పని భక్తుడులో ఉండే జర్నలిస్టులు ఫిట్నెస్ పై దృష్టి సారించాలన్నారు. ఉత్తమ జర్నలిస్టులుగా రాణించాలంటే మానసిక, శారీరక దృఢత్వం కలిగి ఉండాలన్నారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంటుకు 13 జిల్లాల నుంచి జర్నలిస్టులంతా ఒకే వేద పైకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డిఎంహెచ్వో డాక్టర్ శ్రీహరి, డాక్టర్ శశిధర్ రెడ్డి లు మాట్లాడుతూ జర్నలిస్టులు ఆరోగ్యం పై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదాన్ని ఎవరు విస్మరించవద్దని సూచించారు. జర్నలిస్టులంతా తరచూ ఇలా క్రీడల్లో కలవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రత్నాకర్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణంరాజు కార్యదర్శి ఎం శివశంకర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పులిగోరు శ్రీనివాసులు నెల్లూరు శ్రీనివాసులు ట్రెజరర్ సుబ్రహ్మణ్యం మేనేజర్ విజయ్ తో పాటు రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, క్రీడ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: